HYD-మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఇంటికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. తన భార్య వెంకట మాధవిని గురుమూర్తి చంపి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన సంగతి తెలిసిందే. ఎముకలను కాల్చి బూడిద చేసి చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేశారు.