పుణే కారు ప్రమాదం కేసులో తనపై స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. అతడు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. అదీకాక ఈ కేసును ఎమ్మెల్యే సునీల్ టింగ్రే తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆయన అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.