ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ ఇంటి ఆవరణలో భూగర్భం నుంచి నీరు ఒక్కసారిగా భారీ ఒత్తిడితో పైకి ఉబికివచ్చింది. సమీపంలో కొత్తగా బోరు వేయడం వల్ల భూగర్భంలో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. పట్టణాల్లో ఇళ్లు కిక్కిరిసి ఉండటమే ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు అంటున్నారు.