యాక్సియం-4 మిషన్లో భాగంగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా బుధవారం రోదసిలోకి పయనించడంతో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ముగ్గురు ఇతర వ్యోమగాములతో కలిసి ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ,"శుభాంశు శుక్లా రోదసి యాత్రపై దేశం మొత్తం గర్వపడుతోంది" అని పేర్కొన్నారు.