TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక పరిశ్రమలో యూపీకి చెందిన యువకులు పవన్, సాయి పనిచేస్తున్నారు. ఇవాళ డ్యూటీలో ఉన్నప్పుడు సరదా కోసం పరిశ్రమలో వాడే గాలిపంపును సాయి.. పవన్ మలద్వారంలోకి చొప్పించాడు. గాలి ఉద్ధృతంగా వెళ్లడంతో పేగులు దెబ్బతిని పవన్(20) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.