భారతదేశ జనాభా 2025 నాటికి 1.46 బిలియన్ (146 కోట్లు) దాటింది. ఇది ప్రపంచ జనాభాలో 17.78%. 2023లో భారత్ చైనాను అధిగమించి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. అధిక జనాభా వల్ల ఆహారం, నీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. భారత జనాభాలో 50% మంది 25 ఏళ్లలోపు వారు ఉన్నా.. వారికి సరైన విద్య, ఉపాధి కల్పించడం పెద్ద సవాలుగా మారింది.