TG: పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల(D) నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న(22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు పెద్దలను ఒప్పించి ఈ నెల 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం అత్తవారిట్లో స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు. కరెంట్ పలుమార్లు ట్రిప్ అవ్వడంతో విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్ తీశారు. దీంతో షాక్కు గురై మృతి చెందింది.