కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎనౌకౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించామని.. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్