బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరిగి రూ.73,200 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.250 పెరిగి రూ.67,100కు చేరింది. వెండి ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో రూ. లక్ష మార్కును దాటినట్లయింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.