ఖగోళ శాస్త్రవేత్త ఎరిక్ డేవిస్ వెల్లడించినట్లుగా, 1964లో న్యూమెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో సిబ్బంది గ్రహాంతరవాసులను చూశారని, ఈ విషయాన్ని అప్పటి సీఐఏ డైరెక్టర్ జార్జ్ బుష్ సీనియర్కు నివేదించారని పేర్కొన్నారు. 3 అంతరిక్ష నౌకలు బేస్ వద్దకు రాగా, ఒక నౌక నుంచి వచ్చిన గ్రహాంతరవాసి సిబ్బందితో మాట్లాడేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన భౌతిక ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. గ్రహాంతరవాసులకు దగ్గరగా వెళ్లిన సిబ్బందిలో కొంత మందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు కనిపించినట్లు కూడా డాక్యుమెంటరీలో వివరించారు.