పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. ఇటీవల దర్శకుడు, నిర్మాతల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ సుజీత్ సోషల్ మీడియాలో నోట్ విడుదల చేశారు. నిర్మాత దానయ్య తనకు ఎప్పుడూ అండగా ఉన్నారని, ఇలాంటి రూమర్లు అసత్యమని పేర్కొన్నారు. సినిమా పట్ల ఇద్దరికీ ఉన్న నిబద్ధతతో ‘ఓజీ’ అద్భుతంగా తెరకెక్కిందని తెలిపారు.