TG: మాజీమంత్రి హరీష్రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. 'హరీష్రావు తప్పుడు ప్రచారం మానుకోవాలి. కట్టు కథలతో బట్టకాల్చి మీద వేయొద్దు. తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడేది లేదు. ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలి. GRMB అజెండాలో కొత్త అంశాలు ఏమీలేవు. 12 ఏళ్లుగా ఏపీ అవే అభ్యంతరాలు చెబుతోంది. తెలంగాణ రైతుల నీటి హక్కులను కాపాడుతాం. BRS ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు' అని అన్నారు.