అయ్యప్ప దర్శనానికి స్పాట్‌ బుకింగ్‌ లేదు

శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు స్పాట్‌ బుకింగ్‌ ఉండబోదని కేరళ దేవాదాయశాఖ మంత్రి వాసవన్‌ స్పష్టం చేశారు. అయితే వార్షిక మండలం-మకరవిళక్కు సీజన్‌లో వచ్చే అయ్యప్ప భక్తులందరికీ స్వామి దర్శనం లభిస్తుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(TDB) ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. శబరిమల ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ దర్శన టికెట్లు, ప్రసాదాలను ఆన్‌లైన్లో బుక్‌ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్