వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినపడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని నిప్పులు తెలిపారు. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి. తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. జ్వరం 3 రోజులైనా తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇలా పరిశుభ్రత పాటిస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వర్షాకాలం వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.