అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో అలేఖ్య అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరింది. ఈ క్రమంలో ఆమె చెల్లి రమ్య ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. 'మా అక్క అలేఖ్య తాను చేసిన తప్పుకు పబ్లిక్గా క్షమాపణలు చెప్పింది. దాన్ని కూడా మీమర్స్, యూట్యూబర్స్ నెగెటివ్గా స్ప్రెడ్ చేశారు. ఒక ఆడపిల్లను ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు. మా అక్కకి ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా.' అంటూ ప్రశ్నించింది.