హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య బుధవారం ఇంటి నుంచి గెంటేసి వాళ్ల ఇంటిని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో వచ్చి తనపై దాడికి దిగారంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిలో కొంత మంది తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని, దాడి చేసిన వీడియోను రిలీజ్ చేస్తానని తీవ్ర ఆరోపణలు చేశారు.