ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ తన 60వ వన్డే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 30.2 ఓవర్లలో 183పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. రోహిత్ 89 పరుగులు, కోహ్లీ 53 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.