దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, పోయిన మొబైళ్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తయారయ్యే మొబైళ్లలో 'సంచార్ సాథీ' అనే సైబర్ సెక్యూరిటీ యాప్ను డిఫాల్ట్గా అందించాలని మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. ఈ యాప్ను వినియోగదారులు తొలగించలేరు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించారు. ఈ యాప్ ఇన్స్టాలేషన్ అమలుకు మొబైల్ కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చింది.