ఆగస్టు 2025 తర్వాత 350 సంస్కరణలు తీసుకువచ్చామని, ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ, లేబర్ కోడ్ వంటి రంగాల్లో సంస్కరణలు తెచ్చామని, నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు. ఇది 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' ఆధారిత బడ్జెట్ అని, కర్తవ్యభవన్లో రూపొందించిన మూడో బడ్జెట్ అని ఆమె తెలిపారు.