పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఒమన్ తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.