భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా స్వల్ప వ్యవధిలోనే మూడో వికెట్ను కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (1) పరుగును జోష్ హేజిల్వుడ్ ఔట్ చేశాడు. 4.3 వ ఓవర్లో లైన్ అండ్ లెంగ్త్ బంతికి సూర్య వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 32 పరుగుల వద్ద భారత్ మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చాడు.