చిప్స్ ఆశ చూపించి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చిప్స్ ఆశ చూపించి మూడేళ్ల చిన్నారిపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలంలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి, అనంతరం గాయాలపాలైన బాలికను ఇంటి వద్ద వదిలి పరారయ్యాడు. బాలిక పరిస్థితి విషమించడంతో జోధ్‌పూర్ తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిని పాలీ జిల్లాలో అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటనలపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్