తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న నిర్వహించనున్న స్పెషల్ ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) వరకు అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.