AP: తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో సందడి చేశారు. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతుండగా, రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.