రాజస్థాన్కు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్కుమార్ రోత్ ఎంపీగా ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్కు వచ్చారు. అయితే, పార్లమెంట్ పరిసరాల్లోకి రాగానే ఆయన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటెను ఇంతకంటే ముందుకు అనుమతించడం కుదరదని చెప్పారు. సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం వ్యక్తంచేశారు. గతంలో మూడుసార్లు ప్రధానిగా చేసిన వాజ్పేయీ ఎద్దుల బండిలో పార్లమెంట్కు వస్తే తప్పులేదు కానీ, నేను ఒంటెపై వస్తే తప్పేంటి? అని నిలదీశారు.