భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ తిరువనంతపురంలో జరగనుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో హార్దిక్, హర్షిత్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ వచ్చే అవకాశముంది. సంజూ శాంసన్ తన సొంత మైదానంలో తొలిసారి IND తరఫున ఆడనున్నారు. T20 ప్రపంచ కప్కు ముందు ఇది చివరి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపుతో ముగించాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్లో భారీ స్కోర్ నమోదవుతుందో లేదో చూడాలి.