ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా ఇవాళ రా.10 గంటలకు ఇండియా-ఇంగ్లండ్ మధ్య తొలి T20 మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో ఓటమి చవిచూసిన టీమ్ ఇండియా ఈ టూర్లో కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అటు కివీస్ చేతిలో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ENG కూడా T20ల్లో సత్తా చాటాలని భావిస్తోంది.