హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగనుంది. క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న టీమ్ను క్రమశిక్షణ కమిటీ ఆహ్వానించింది. అటు మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలు ఒంటరిని చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీనాక్షీ నటరాజన్కు కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ పెట్టింది.