మన దేశంలో జుగాఢ్ వ్యక్తులకు కొదువ లేదు. ప్రతి పనికి మనవాళ్ల దగ్గర తప్పనిసరిగా ఓ టెక్నిక్ ఉంటుంది. మనవాళ్లు ఎలాంటి సమస్యలైనా సరే దానికి అతి తక్కువ ఖర్చులో పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీని మినీ స్విమ్మింగ్ పూల్గా మార్చేసి కేరింతలు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.