నవమాసాలు మోసి, బిడ్డకు జన్మనిచ్చి.. బిడ్డను చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన యూపీలో చోటుచేసుకుంది. మేరఠ్కు చెందిన కరిష్మా శుక్రవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను పై ఫ్లోర్ నుంచి కింద ఉన్న ఫ్లోర్కి లిఫ్ట్లో తరలిస్తుండగా.. లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కరిష్మా అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కరిష్మా భర్త వాపోయారు.