మధ్యప్రదేశ్లో బోరుబావిలో శనివారం పడిన బాలుడు సుమిత్ (10) చనిపోయాడు. గుణా ప్రాంతంలో బోరుబావిలో సుమిత్ పడిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆషరేషన్ చేపట్టి బాలుడిని ఎట్టకేలకు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బాలుడు చనిపోయినట్లు గుణా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు.