ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ (M) మోదుమూడి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి చరణ్(15), ఎం. వీరబాబు(15), ఎం. వర్ధన్(16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. డీఎస్పీ విద్యాశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.