సెల్ఫీల మోజుతో ఇద్దరు యువకులు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటన గుజరాత్లో జరిగింది. వడోదర నగరంలోని నర్మదా కాలువ వద్ద సెల్ఫీ తీసుకునే సమయంలో కాలువలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.