TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు. వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.