రాజస్థాన్లోని జోద్పూర్లో ఓ డంపర్ డ్రైవర్ నిర్లక్ష్యం పోలీసుల ప్రాణాల మీదకు తెచ్చింది. వాహనాన్ని వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న పోలీసుల వాహనంతో పాటు మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళా కానిస్టేబుల్తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కాగా వైరల్గా మారాయి.