AP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆలయాల్లో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.