TG: తుమ్మిడిహెట్టి బ్యారేజ్ విషయంలో CM రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు లేఖ రాశారు. బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి సమీక్షించాలన్నారు. తెలంగాణ ప్రతినిధులకు సమయం ఇవ్వాలని, సమావేశ తేదీని ఖరారు చేయాలని అందులో కోరారు. 148 మీటర్ల FRL నీటి అవసరాలకు సరిపోదన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మెదక్ జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. FRL పెంపుతో గ్రావిటీ ద్వారా నీరు తరలించవచ్చన్నారు.