టీవీకే అధినేత విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, తాము త్వరలోనే మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్ను కోరినట్లు సమాచారం. అయితే దీనిపై గవర్నర్ స్పందన ఏమిటన్నది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, మధ్యాహ్నం లోపు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.