టీవీకే చీఫ్ విజయ్ ఫిబ్రవరి 23న తమిళనాడులోని వేలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆయన వేదికపై ప్రసంగించనున్నారు. చెన్నై-బెంగళూరు రహదారికి సమీపంలో పల్లికుప్పం వద్ద 30 ఎకరాల మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో విజయ్ కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది.