హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన రాహుల్ రాథోడ్, మీను రాథోడ్ దంపతులు ఐవీఎఫ్ చికిత్స తీసుకున్న తర్వాత (జనవరి 5న) కవల ఆడపిల్లలు జన్మించారు. అయితే, పిల్లల పోలికలు తమతో సరిపోలకపోవడంతో అనుమానంతో డీఎన్ఏ పరీక్షలు చేయించగా, ఆ పిల్లలు తమవారు కాదని తేలింది. వేరే దంపతుల పిండాన్ని పొరపాటున లేదా మోసపూరితంగా గర్భంలో ప్రవేశపెట్టారని దంపతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది.