రాజస్థాన్ బికనేర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందారు. వాహనంలోకి మందుగుండు సామగ్రిని ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.