నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందారు. రోహిణి అనే ప్రాంతంలోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ దగ్గర పీజీ భవనంలో ఈ ఘనట చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ వాసిగా.. మరొకరు ఢిల్లీలోని పాలెం కాలనీకి చెందిన నివాసిగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదా ఏదైనా గొడవ కారణంగా చనిపోయారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్