సెప్టెంబర్లో జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్తో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. ప్యాసింజర్ వెహికల్స్ డిస్పాచ్లు 4 శాతం పెరిగి 3,72,458 యూనిట్లకు, టూవీలర్ సేల్స్ 7 శాతం పెరిగి 21,60,889 యూనిట్లకు, త్రీవీలర్ డిస్పాచ్లు 5.5 శాతం వృద్ధితో 84,077 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల ప్రభావంతో కేవలం 9 రోజుల్లోనే అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.