AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఇద్దరు యువకులు ఏకంగా నాలుగు చొప్పున ఉద్యోగాలు సాధించారు. నాయుడు కాలనీకి చెందిన భానుప్రసాద్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ పూర్తయిన 40 రోజుల్లోనే BOB పీవోగా, SBI క్లర్క్గా, సెంట్రల్ బ్యాంక్లో క్లర్క్గా, TGBలో పీవోగా ఉద్యోగం సాధించారు. అదే కాలనీకి చెందిన పెంట రాకేశ్ కుమార్ కూడా కెనరా బ్యాంక్, TGB, SBI, యూనియన్ బ్యాంక్లో ఉద్యోగాలు సాధించారు.