ఆధార్ దుర్వినియోగాన్ని నివారించేందుకు UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయినవారి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది. అయితే కొంతమందిది పొరపాటున మరణించిన వారిగా నమోదు కావడంతో, వారి కార్డులు కూడా నిలిపివేయబడ్డాయి. అలాంటి వారు UIDAI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ఆధార్ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.