అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై వెలువడిన నివేదికలో ఇంధన సరఫరా నిలిపివేతపై ప్రస్తావించారు. దీనిపై యూకే పౌర విమానయాన అథారిటీ స్పందిస్తూ, ఈ ప్రమాద ఘటనకు నాలుగు వారాల ముందే బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్లపై హెచ్చరికలు చేసినట్లు పేర్కొంది. 787 డ్రీమ్లైనర్తో పాటు ఐదు రకాల బోయింగ్ విమానాల్లో ఇంధన షట్ ఆఫ్ వాల్వ్లను ప్రతిరోజూ తనిఖీ చేయాలని హెచ్చరికలు జారీ చేశామని పేర్కొంది.