సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్నగర్లోని పాటిగడ్డ అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అక్కడ చిన్నారులతో సమయం గడిపి, వారికి అందుతున్న విద్యాబోధన, పౌష్టికాహారం, ఆరోగ్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం బెంచీలు, టేబుల్స్, ఆటవస్తువులు, హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.