ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎలాంటి ఛార్జ్ లేకుండా ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇది 2026 DEC 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ సేవకు రూ.75 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దానిని రద్దు చేశారు. అధికారిక ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే OTPతో లాగిన్ కావాలి. ఆ తర్వాత ఈమెయిల్ యాడ్ లేదా అప్డేట్ ఎంచుకుని జీమెయిల్ వివరాలను సబ్మిట్ చేయాలి. సుమారు 15 రోజుల్లో మెయిల్ ఐడీ అప్డేట్ అవుతుంది.