బైజూస్‌కు అమెరికా కోర్టు షాక్: $1 బిలియన్ చెల్లించాలని ఆదేశం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. బైజూస్‌ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు డిఫాల్ట్‌ జడ్జిమెంట్‌ వెలువరించింది. ఈ మేరకు నవంబర్‌ 20న తీర్పు వెలువరించిన కోర్టు, పిటిషనర్లకు 1 బిలియన్‌ డాలర్లను వ్యక్తిగతంగా చెల్లించాలని బైజూస్‌ రవీంద్రన్‌ను ఆదేశించింది. తమ తీర్పును రవీంద్రన్‌ ఉల్లంఘించడం, పట్టించుకోకపోవడంతో ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్