AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడిలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు కరెంట్ షాక్ కొట్టడంతో ప్రసాదాల పంపిణీని అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ప్రసాదాల పంపిణీని కొనసాగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.